ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2017 విద్యాసంవత్సరం నుంచి జాయింట్ ఎంట్రన్స ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ర్యాంకుతోపాటు ఇంటర్ సెకండియర్లో 75 శాతం మార్కులు ఉండాలని సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిబంధన విధించింది. 2017 నుంచి జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెయిటేజీని రద్దుచేసినప్పటికీ నిర్ణీత శాతంలో మార్కులు సాధించిన వారికి మాత్రమే జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుందనే నిబంధన విధించింది.