దుండగుల కాల్పుల నుంచి బీజేపీ ఎమ్మెల్యే జిత్రేంద్ర సింగ్ షంటీ తృటిలో తప్పించుకున్నారని పోలీసుల వెల్లడించారు. బుధవారం తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆయన నివాసం వెలుపల నిల్చున్నారని... ఆ సమయంలో మోటర్ సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు జితేంద్రపై విచక్షణ రహితంగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమై దుండగుల కాల్పుల నుంచి తప్పించుకున్నారని తెలిపారు. దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వివరించారు.
Sep 3 2014 10:34 AM | Updated on Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement