యువతి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్ట్‌

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

కడప అర్బన్‌ : కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పటేల్‌ రోడ్‌లో నివాసముంటున్న నాదెండ్ల రాజ రెండవ కుమార్తె అయిన రెహనాకు రెండు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మారన్నగారి వీరయ్య, వహీదాల కుమారుడైన షాజహాన్‌తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థమైన తర్వాత రెహనాతో షాజహాన్‌ మాట్లాడే క్రమంలో నీవు అంటే ఇష్టం లేదని తెలిపారు. నిశ్చితార్థమైన తర్వాత ఇలా మాట్లాడితే అవమానం భరించలేక చనిపోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పినా వినలేదు. అతని తల్లిదండ్రులు వహీదా, వీరయ్యలు కూడా షాజహాన్‌కు సపోర్ట్‌ చేస్తూ.. నువ్వు చనిపోతే మాకేం మా కుమారుడు మాకు ముఖ్యమని కఠినంగా మాట్లాడారు. రెహానా వారు మాట్లాడిన మాటలకు చనిపోవాలని నిర్ణయించుకుని తన ఇంటిలో సూసైడ్‌ నోట్‌ రాసి తన ఇంటి బెడ్‌ రూములో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషయమై రెహనా తండ్రి నాదెండ్ల రాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21 వ తేదీన చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లోఎస్‌ఐ ప్రతాప్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కేసులోని నిందితులైన మారన్నగారి షాజహాన్‌, అతని తల్లిదండ్రులు మారన్నగారి వహీదా, మారన్నగారి వీరయ్యలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement