
పారదర్శకంగా మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్
కడప అర్బన్ : సాధారణ బదిలీల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి కడప జిల్లాలో వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్కు మొత్తం 646 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు. దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్, తదితరులను వారి సమస్యల ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని, వైద్యుల పర్యవేక్షణలో నిజ నిర్ధారణ చేసుకుని పారదర్శకంగా బదిలీలు చేపట్టామని తెలిపారు. అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పి. బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, డి.పి.ఓ ఏ.ఓ జ్యోతి, సూపరింటెండెంట్లు, శ్రీనివాస నాయక్, సురేష్, క్లర్కులు ఏ8 అగస్టీన్, ఏ10 గురప్ప, ఐ.టి.కోర్ టీమ్ కానిస్టేబుల్ విశ్వనాథ్, డి.పి.ఓ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.