
వచ్చేనెల 12 నుంచి జేవీవీ రాష్ట్ర మహాసభలు
కడప ఎడ్యుకేషన్: కడపలో జులై 12, 13 తేదీల్లో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. జన ఈ విషయాన్ని విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు బి. విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కడప ఎస్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి జేవీవీ పోరాడుతోందన్నారు. అలాగే ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి తమ వేదిక ప్రధానంగా కృషి చేస్తోందన్నారు. జేవీవీ సమాచార కార్యదర్శి పి. సలావుల్లా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఆరోగ్యం, విద్యా కేంద్రీకృతంగా తమ సంస్థ కృషి చేస్తోందని అన్నారు. కడపలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు కె. సురేష్ బాబు, సుధాకర్, ఇలియాస్బాషా,వెంకటరామిరెడ్డి, శేషారెడ్డి,భాస్కర్, నాగార్జునరెడ్డి, గౌరీ శంకర్, మహబూబ్ బాషా,వెంకటశివ,వలిరాజు,భాగ్యలక్ష్మి, ఎల్లేశ్వర రావు,హైదర్ అలీ, రమణారెడ్డి,సుబ్బారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
వీఆర్కు సీఐ నాగార్జున
కడప అర్బన్: కడప నగరంలోని టూటౌన్ సీఐగా పనిచేస్తున్న బి.నాగార్జునను కడప వీఆర్కు తరలిస్తూ కర్నూలు– కడప రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులను జారీ చేశారు. సీఐపై వచ్చిన పలు రకాల ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీఆర్కు పంపినట్లు సమాచారం. ఈ మేరకు సీఐ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ వద్ద హాజరై ఉత్తర్వులను ఆందుకున్నారు.