
కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డీఆర్వో కోరారు.
డిజిటల్ అసిస్టెంట్ల
బదిలీ కౌన్సెలింగ్
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, డీపీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఖాదర్బాషలు హాజరై డిజిటల్ అసిస్టెంట్ల పత్రాలను పరిశీలించారు. జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఇందులో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారు 274 మంది, రిక్వెస్ట్ బదిలీ కోసం 40మంది దరఖాస్తు చేసుకున్నారు.
నేడు సభాభవన్లో
పీజీఆర్ఎస్ నిర్వహణ
కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చని తెలిపారు.
● డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చున న్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.