
నెత్తురోడ్లుతున్నాయ్!
రహదారులు నెత్తురోడుతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిద్ర లేమి.. వెరసి రోడ్డు ప్రమాదాలతో ఎరుపెక్కాయి. ఇటీవల జిల్లాలో జరిగి న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. 2025 మే 26న గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు లారీ ఢీ కొన్న ప్రమాదాలల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
● గత వారంలో రాయచోటి నుంచి హైదరా బాదుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
జాతీయ రహదారి వెంబడి ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. నిబంధనల మేరకు ముందు, వెనుక వాహనాలకు రిఫ్లైక్టింగ్ స్టిక్కర్లు అతికించాల్చిన అవసరం ఉంది. ఇవి రాత్రి వేళల్లో వాహనచోదకునికి ముందు వాహనం ఉందనే విషయాన్ని సృష్టంగా కనిపించేలా చేస్తుంది. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతి వేగంతో దూసుకెళుతున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. బ్లాక్ స్పాట్లలో సూచిక బోర్డులు, విద్యుద్దీపాలు, రహదారి మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలి. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి.
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో సమారు 307 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 172 మంది మృత్యువాత పడగా 364 మంది క్షతగాత్రులయ్యారు. వేగ నియంత్రణ అమలు చేయకపోవడం, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు ఈ విషయాల్లో పున: సమీక్షించాల్సిన అవసరం ఉంది.
కారణాలెన్నో......
మితి మీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్ టేక్, అకస్మాత్తుగా వాహనం నిలపడం, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర విషయాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై లారీలను ఇష్టానుసారంగా నిలిపేస్తున్నారు. హోటళ్లు, డాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి అనుకొని ఆపుతున్నా రు. ఈ క్రమంలో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక వాటిని ఢీ కొంటున్నాయి. లారీలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా విశ్రాంతి స్థలాల్లో మాత్రమే నిలపాల్సి ఉన్న అక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లకు అనుకొని, చెట్ల కింద ఆపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు అధికంగా రాత్రి వేళ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అందులో క్లీనర్గా పని చేసే వారు అరకొర డ్రైవింగ్తో అప్పుడప్పుడు వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం, ముందు వెళుతున్న వాటిని వేగంగా అధిగమించే క్రమంలో పట్టుకోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
తీర్మానం చేసినా.... ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 70 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్ సేప్టీ సమావేశాల్లో తీర్మానించారు. అది కార్యరూపం దాల్చినా కేవలం ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. అనంతరం అధికారులు అటు వైపు దృష్టి సారించిన దాఖల్లా లు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పదించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గతంలోనే గుర్తించారు. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు తొలగేలా వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టా యి. కాలక్రమంలో దీనికి బ్రేక్ పడింది.
సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
ఇలా చేస్తే...
ఒకరి నిర్లక్ష్యం..మరొకరికి ప్రాణ సంకటం
మితిమీరిన వేగంతోనేరోడ్డు ప్రమాదాలు
ఐదు నెలల్లో172 మంది మృత్యువాత
రోడ్డు నిబంధలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం
రోడ్డు నియమ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాల వేగ నియంత్రణను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్లతో తనిఖీలు చేపడుతున్నాం. మద్యం మత్తుల్లో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. –నిరంజన్రెడ్డి,
ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా
2020 825 307 970
2021 861 368 949
2022 801 403 837
2023 631 372 730
2024 664 321 737
2025 307 172 364
మే వరకు

నెత్తురోడ్లుతున్నాయ్!

నెత్తురోడ్లుతున్నాయ్!