2 నుంచి తరగతులు | - | Sakshi
Sakshi News home page

2 నుంచి తరగతులు

Jun 27 2025 4:37 AM | Updated on Jun 27 2025 4:37 AM

2 నుంచి తరగతులు

2 నుంచి తరగతులు

కడప సెవెన్‌రోడ్స్‌: పేద విద్యార్థులకు అధునాతన వసతులు, నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో జిల్లాలోని బి.మఠంలో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ బాలుర మహా గురుకులంలో జూలై 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలులో బి.మఠం మండలంలో ఏర్పాటైన డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ మహా గురుకులం (బాలుర) విద్యా లయంలో తరగతుల ప్రారంభానికి సంసిద్ధత, విద్యార్థుల అడ్మిషన్‌ అంశాలపై సమావేశం నిర్వహించారు.అత్యాధునిక సదుపాయాలు, వసతులతో రూపు దిద్దుకున్న ఈ గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి 800 మంది విద్యార్థులతో అడ్మిషన్లు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement