డ్రగ్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

Jun 27 2025 4:37 AM | Updated on Jun 27 2025 4:37 AM

డ్రగ్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

డ్రగ్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

కడప సెవెన్‌రోడ్స్‌: వైఎస్సార్‌ కడపను డ్రగ్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని, అందుకోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేయాలని జేసీ అదితిసింగ్‌ పిలుపునిచ్చారు. గురువారం నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం,ఈగల్‌ (ఎలైట్‌ యాంటి–నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్ఫోర్స్‌మెంట్‌) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వాకథాన్‌ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడం కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. విద్యార్థుల వసతి గృహాలు, కాలేజీలు, పాఠశాలల్లో డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతినిత్యం తల్లిదండ్రులు తమ పిల్లల చెడు వ్యసనాలపై అప్రమత్తంగా వ్యవహరించి వారిలో మంచి అలవాట్లపై అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు,వినియోగాన్ని నిరోధించడానికి 1972 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి తెలియజేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాటాడారు. అడిషనల్‌ ఎస్పీ ప్రకాష్‌ బాబు,ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు, ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌ తదితరులు పాల్గొన్నారు.

జేసీ, ఎస్పీల పిలుపు

నగరంలో వాకథాన్‌ ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement