
చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా మోగించాయి. శనివారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నెల్లూరు జట్టుపై 110 పరుగుల తేడాతో చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చిత్తూరు జట్టు 46.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 237పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్రెడ్డి 119 బంతులకు 110 పరుగులు చేశాడు . నెల్లూరు జట్టులో భార్గవ్ మహేష్ 5, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 238 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 31.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేశారు. ఆ జట్టులోని సాహుల్ హామీద్ 60 పరుగులు చేశాడు . చిత్తూరు జట్టులోని ధనుష్రెడ్డి 4 వికెట్లు తీశాడు.
110 పరుగుల తేడాతో
అనంతపురం జట్టు విజయం:
కెఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్లో కర్నూలు జట్టుపై 110 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అనంతపురం జట్టు 50 ఓవర్లలకు 283 పరుగుల చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రిహాన్ 16 ఫోర్లు, 2 సిక్సర్లతో117 పరుగులు చేశాడు. అనంతరం 284 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 31.3 ఓవర్లలో 173 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని కెవి ఓంకార్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని నిషిచ్ 5, టివి సాయి ప్రతాప్ రెడ్డి 5 వికెట్లు తీసుకున్నారు.

చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా

చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా

చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా

చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా