బైకును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొన్న లారీ

May 30 2025 1:35 AM | Updated on May 30 2025 2:26 PM

మహిళ ఎడమ చేయి నుజ్జునుజ్జు

పుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి మోడల్‌ స్కూల్‌ సమీపంలో గురువారం బైకును లారీ ఢీ కొన్న సంఘటనలో బైకుపై వెళ్తున్న మహిళ ఎడమచేయి లారీ కింద పడటంతో నుజ్జునుజ్జు అయింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరబల్లి మండలం, తొట్టికిందపల్లి దళితవాడ గ్రామానికి చెందిన రామ్మోహన్‌, సునీత దంపతులు. వీరు సునీత పుట్టినిల్లు అయిన పుల్లంపేట మండలం, అనంతంపల్లి పంచాయతీలోని జానకీపురానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. 

పుల్లంపేట మోడల్‌ స్కూల్‌ సమీపంలోకి రాగానే కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఎదురుగా లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రామ్మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా, సునీత కుడిచేతికి స్వల్ప గాయాలు కాగా, ఎడమ చేయి లారీ కిందపడటంతో నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రులను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యంకోసం తిరుపతికి తీసుకెళ్లినట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement