
పిచ్చి కుక్క స్వైరవిహారం
బద్వేలు అర్బన్ : పట్టణంలోని వెంగమాంబ నగర్, సుమిత్రానగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఒకే రోజున ఆయా ప్రాంతాల్లోని ఎనిమిది మందిపై దాడి చేసింది. తొలుత ఇంటి ముందు ఆడుకుంటున్న రోషిణి (11), శబరినిధి(5)లపై దాడి చేసి గాయపరచింది. నరసమ్మ(57), హుస్సేన్బాషా(50), రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతుండగా వారిపైనా విరుచుకుపడింది. వీరితోపాటు శ్రీకాంత్, మహబూబ్నాజర్, పవన్కుమార్రెడ్డిలపై కూడా దాడి చేయడంతో అందతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సిద్దవటం రోడ్డులో పిచ్చికుక్క మరో ఇద్దరిపై కూడా దాడి చేయగా వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని మున్సిపల్ సిబ్బందికి తెలిపినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు.
ఒకే రోజున ఎనిమిది మందిపై దాడి

పిచ్చి కుక్క స్వైరవిహారం