
గుజిరీ దుకాణంలో గంజాయి
మదనపల్లె రూరల్ : పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. చాపకింద నీరులా మత్తు విస్తరిస్తోంది. పట్టణ శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుని మత్తులో జోగుతున్నారు. ఈఎస్టీఎఫ్ సీఐ వి.యల్లయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ బీఎంపీపీ సీఐ సత్యశ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. నక్కలదిన్నె తండా సమీపంలోని పాత సామాన్లు, స్క్రాప్ విక్రయించే గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్, బీఎంపీపీ, రాయచోటి ఈఎస్టీఎఫ్ సీఐ, సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారని తెలిపారు. పొన్నేటిపాళెంకు వెళ్లే దారిలోని గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకుని 2.100 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోషే అలియాస్ బన్ను పారిపోగా, ఎస్.మహమ్మద్బాషా (22), సయ్యద్సద్దాం (35), బి.దినకర్ (21), పి.సాయిప్రసాద్ (25)లను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగిస్తున్న హోండా డియో టూవీలర్ను సీజ్ చేశామన్నారు.
ఆస్పత్రిలో పారిపోయే ప్రయత్నం
గంజాయి అమ్ముతుండగా పట్టుకున్న నిందితులను రిమాండ్కు పంపే ముందు వైద్య పరీక్షల కోసం ఎక్సై జ్ సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. నిందితులను పరీక్షిస్తుండగా గంజాయి మత్తులో ఉన్న పల్లపోలు సాయిప్రసాద్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వేగంగా పరిగెత్తగా, అప్రమత్తమైన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. మత్తులో ఉన్న సాయి ప్రసాద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, మత్తులో తూలడం కనిపించింది.
ఐదుగురి అరెస్టు, 2.100 గ్రాముల స్వాధీనం