
34 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా వాహనం సీజ్
కడప అర్బన్/చింతకొమ్మదిన్నె : మామిళ్లపల్లి సెక్షన్, ఇప్పపెంట బీటు, పాలకొండ రిజర్వు ఫారెస్ట్లోని ‘వంక బావి రస్తా‘ ప్రదేశంలో ఒక ఇన్నోవా వాహనం, 34 ఎరచ్రందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్ సమాచారం ప్రకారం కడప ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. ప్రసాద్ ఆధ్వర్యంలో మామిళ్లపల్లి, మద్దిమడుగు సెక్షన్ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంపు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. పారిపోయిన నిందితులను త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా (ఏపీ 37 సీహెచ్ 9919) యజమాని పులి వరప్రసాద్ రవికుమార్, రామేశ్వరం, ప్రొద్దుటూరుగా గుర్తించామన్నారు. ఈ దాడిలో మామిళ్లపల్లి సెక్షన్ డిప్యూటీ ఆర్ఓ ఎస్. ఓబులేసు, మద్దిమడుగు ఎఫ్ఎస్ఓ షకీల్ అహమ్మద్, ఎఫ్బీఓలు కె. శోభారాణి, ఎన్. బాషా, ఎస్. రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.