కడప వైఎస్ఆర్ సర్కిల్: కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడుతున్న ల్యాండ్, శాండ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణ యాలను సమూలంగా మార్పులు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా నడుస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ వంకా, వాగు, చెరువు, రాస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈ నామ్, వక్ఫ్, అటవీ, స్మశాన భూముల ఆక్రమణ యదేచ్చగా సాగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ అనుమతులు లేని మట్టి క్వారీలు ఏర్పా టు చేసుకొని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మండిపోతున్న ఎండల ప్రభావం భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోయి చేను ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
పీపీ యూనిట్ వైద్యురాలిపై సస్పెన్షన్ వేటు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని పీపీ యూనిట్ వైద్యురాలు ఇలియారాణిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి కొన్ని రోజుల క్రితం చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇలియారాణిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి నుంచి డీఎంహెచ్ఏ నాగరాజుకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఆందాయి. తన భార్యకు అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని రెండు రోజుల క్రితం విశ్వనాథ్రెడ్డి కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పీపీ యూనిట్ ఇన్చార్జి బాధ్యతలను డాక్టర్ నజీర్బాషాకు అప్పగించారు.