ఫ్లైయాష్‌ వ్యవహారంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఫ్లైయాష్‌ వ్యవహారంపై విచారణ

Mar 20 2025 12:12 AM | Updated on Mar 20 2025 12:12 AM

ఫ్లైయాష్‌ వ్యవహారంపై విచారణ

ఫ్లైయాష్‌ వ్యవహారంపై విచారణ

ఎర్రగుంట్ల : డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్‌లైయాష్‌ రవాణా వ్యవహారంపై ఏపీజెన్‌కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్‌కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్‌లైయాష్‌ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్‌లైయాష్‌ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ గౌరీపతిని ఫోన్‌లో వివరణ కోరగా సాధారణ విచారణలో భాగంగానే ఏపీజెన్‌కో నుంచి అధికారులు వచ్చి విచారణ చేపడుతున్నారని తెలిపారు.

మామిడి తోటకు నిప్పు

– 40 చెట్లు దగ్ధం

చిన్నమండెం : ఆకతాయిలు మామిడి తోటకు నిప్పు పెట్టడంతో 40 మామిడిచెట్లు కాలిపోయినట్లు బాధిత రైతులు బయన్న, రామచంద్ర, రమణయ్య తెలిపారు. వారి కథనం మేరకు.. మండల పరిధిలోని నాగూరువాండ్లపల్లె సబ్‌ స్టేషన్‌ పక్కన గల మామిడితోట వద్ద గల కంచెకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మామిడి తోట దగ్ధం కావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు చేరుకొని మంటలను అదు చేశారు. అప్పటికే 40 చెట్లు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement