రామాపురం: మండలంలోని నీలకంట్రావుపేట సమీపంలోని దర్గా వద్ద శ్రీ సద్గురు హజరత్ దర్బార్ అలీషావలి, రమతుల్లా అలైబాబా శ్రీ జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. గురువారం గంధంతో ప్రారంభమైన ఉరుసుకు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. గతంలో దర్గా స్వామిజీ, దర్గా మాతాజీలు ఈ ఉరుసు ఉత్సవాలను జరిపేవారు. వారు పరమపదించడంతో సత్యమయ్య స్వామిజీ, శంకరయ్య స్వామి జీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరుకు చెందిన ఆస్మానిఖత్, నాగపూర్కు చెందిన సలీం సైదా మధ్య గొప్ప ఖవాలీ పోటీ జరిగింది. అంతకు ముందు జెండా ఊరేగింపు జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి 70–80 అడుగులు పొడవు కలిగిన వెదురు బొంగుతో దర్గాకు చేరుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదివింపులు, చాదర్తో దర్గాలో ఫాతేహా నిర్వహించారు.
ఘనంగా ముగిసిన దర్గా ఉత్సవాలు