ప్రశాంతంగా ముగిసిన
ఇంటర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మార్చి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 17114 మంది, సెకెండియర్కు సంబంధించి 15771 మంది విద్యార్థులు మొత్తంగా జనరల్, ఒకేషనల్కు సంబంధించి 32885 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ సందర్భంగా ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పరీక్షలను నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణకు సహరించిన అన్నిశాఖలకు అయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
చివరి రోజు 544 మంది గైర్హాజరు...
ఇంటర్ పరీక్షల్లో భాగంగా చివరిరోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 14083 మంది విద్యార్థులకుగాను 13539 మంది హాజరుకాగా 544 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు.
పరీక్షలు ముగియడంతో పిల్లలు ఖుషీ ఖుషీగా కనిపించారు. పరీక్ష ముగించుకుని బయటకు రాగానే కేరింతలు కొట్టారు. ఒకరికొకరు చేతులు కలుపుకోవడం.. సెండాఫ్ చేప్పుకోవడం వంటి సంబరాల్లో మునిగిపోయారు.