
కక్ష సాధింపుతోనే చికెన్ దుకాణానికి నిప్పు
ఎర్రగుంట్ల : కక్ష సాధింపుతోనే కొందరు వ్యక్తులు వైఎస్సార్సీపీ కార్యకర్త నరేష్ కుమార్ చికెన్ దుకాణానికి నిప్పు పెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో నరేష్కుమార్ గత కొద్ది రోజులుగా చికెన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇటీవల వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేశారు. ఇది ఓర్వలేని కొందరు వ్యక్తులు శుక్రవారం అతడి చికెన్ దుకాణానికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నరేష్ కుమార్ పార్టీ కోసం చాలా కష్టపడడం ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. బాధితుడికి వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. బాధితుడు నరేష్కుమార్ మాట్లాడుతూ దుకాణంలో సుమారు 300 కోళ్లు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయని, దాదాపు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. అనంతరం నరేష్కు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బహుదూర్, రామక్రిష్ణ, రఘునందన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి