
నాటు సారా నిర్మూలనకు సహకరించాలి
చక్రాయపేట : గ్రామాల్లో నాటు సారా నిర్మూలనకు గ్రామస్తులందరూ అధికారులకు సహకరించాలని ఎకై ్సజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్ పేర్కొన్నారు. గురువారం చక్రాయపేట మండలం కల్లూరుపల్లె తాండాలో నవోదయం–2 కార్యక్రమంలో భాగంలో నాటుసారా నిర్మూలన కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఆయన హాజరై నాటుసారా వలన కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు ప్రజలకు వివరించారు. అనంతరం డేగ కళాజాత బృందం నాటిక, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వినోద్కుమార్, గ్రామ సర్పంచ్ పురుషోత్తం నాయక్, పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్రెడ్డి, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు విశ్వనాథరెడ్డి, చెన్నారెడ్డి, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుస్సేన్, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.