● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 750 మెడికల్ సీట్లను మంజూరు చేయించగా, చంద్రబాబు వచ్చాక పీ4 కింద కళాశాలలన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి విమర్శించారు. ప్రజలను భ్రమల్లో పెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చకపోగా, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపులతో భారాలు మోపిందని విమర్శించారు.