కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

Mar 13 2025 12:36 AM | Updated on Mar 13 2025 12:35 AM

సమస్యలకు సత్వర పరిష్కారం

– ఎస్పీ అశోక్‌కుమార్‌

రాజుపాళెం : సమస్యపై బాధితులు ఫిర్యాదు చేసినపుడు వారికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ సిబ్బందికి సూచించారు. రాజుపాళెం పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించి క్రైం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సమస్యపై ఫిర్యాదు చేస్తే పెండింగ్‌ లేకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎక్కువగా రైతుల పొలం గట్లు, భూమి సమస్యలు ఉంటాయని, అవి ఎలాంటి పరిణామాలకై నా దారితీస్తాయన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన, బాలమద్దిలేటి, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

కడప అర్బన్‌ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్‌ శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌ కుమార్‌ ఆదేశాల మేరకు కడప నగరం శివారున అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్‌ అధికారులు, సిబ్బంది డ్రోన్‌ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతూ అక్కడ అనుమానస్పదంగా సంచరించే వారిని గుర్తించనున్నారు. బుధవారం నగరంలోని గుర్రాలగడ్డ, అల్మాస్‌ పేట బ్రిడ్జి, బుగ్గవంక పరివాహక ప్రాంతం, ఏ.ఎస్‌.ఆర్‌ నగర్‌ పరిసర ప్రాంతాలు, పులివెందుల రోడ్‌ లోని సాక్షి సర్కిల్‌ పరిసరాలలో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ఫ్యాక్షన్‌ జోన్‌ ఇన్స్‌పెక్టర్‌ రమణారెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

కెపాసిటర్లతో బిల్లులో తగ్గుదల

కడప కార్పొరేషన్‌ : అధిక లోడ్‌ వినియోగించే వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు కెపాసిటర్లను సరైన పద్ధతిలో వాడితే విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గించుకోవచ్చని వైఎస్సార్‌ జిల్లా విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌రమణ తెలిపారు. తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ లోడ్‌ ఆన్‌ అయినప్పుడు మాత్రమే కెపాసిటర్లు ఆన్‌ కావాలన్నారు. కెపాసిటర్ల సామర్థ్యం విద్యుత్‌ లోడ్‌కు 65 శాతం నుంచి 75 శాతం వరకూ ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఉదాహరణకు 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్‌ లోడుకు 65 నుండి 75 కేవీఎఆర్‌ కెపాసిటీ కెపాసిటర్లు వాడితే యూనిటీ పవర్‌ ఫ్యాక్టర్‌ 1.0 ఉంటుందని, దీంతో బిల్లులు తగ్గించుకోవచ్చన్నారు.

హజ్‌ యాత్రపై అవగాహన ఉండాలి

ప్రొద్దుటూరు కల్చరల్‌ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌, ఉమ్రా యాత్రలపై అవగాహన అవసరమని సినీ నటుడు ఆలీ పేర్కొన్నారు. స్థానిక ఎస్‌కే గ్రాండ్‌లో ఆల్‌ ఇన్‌ఫో టెక్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కడప, కర్నూలు, రాయచోటి ప్రాంతాల్లో తనకు బంధువులున్నట్లు తల్లిదండ్రులు చెబుతుండేవారని పేర్కొన్నారు. హాస్య నటుడు రాజబాబును స్ఫూర్తిగా తీసుకుని సినిమాలోకి వచ్చానని, 45 సంవత్సరాల సినీ ప్రయాణంలో 1260 సినిమాల్లో నటించానని చెప్పారు. తక్కువ ధరలోనే హజ్‌, ఉమ్రాకు ఆల్‌ ఇన్‌ఫోటెక్‌ సంస్థ ప్యాకేజీలను ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. వీఎస్‌ ముక్తియార్‌, షేక్షా, అయూబ్‌ ఖాన్‌, అబ్దుల్‌ అజీం, మౌలానా అబ్దుల్‌ మొహిద్దీన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్ష

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 14900 మంది విద్యార్థులకుగానూ 14310 మంది హాజరైనట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జనరల్‌కు సంబంధించి 11,289 మంది, ఒకేషన ల్‌కు సంబంధించి 1075 మంది హాజరయ్యారు.

మదనపల్లె : కర్ణాటక రాష్ట్ర సరిహద్దున మదనపల్లెకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి తీవ్రగాయాలవగా, 40 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నుంచి సువర్ణముఖి(సబర్వాల్‌) ప్రైవేట్‌ బస్సు మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళుతోంది. అదే సమయంలో బెంగళూరు నుంచి ఏఆర్‌బీసీవీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నంద్యాలకు వెళ్తోంది. కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలోని గెలిజగూరు వద్దకు రాగానే రాత్రి 1 గంట సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏఆర్‌ ట్రావెల్స్‌ బస్సు ముందువైపు వెళుతున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేస్తూ, ఎదురుగా వచ్చిన సువర్ణముఖి బస్సును ఢీకొంది. ప్రమాదంలో మదనపల్లె కమ్మవీధికి చెందిన సువర్ణముఖి ప్రైవేట్‌ బస్సు కండక్టర్‌ గంగాధర్‌ అలియాస్‌ బాబు (59) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ వెనుకసీటులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్రయాణికులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో చింతామణికి చెందిన వెంకటేష్‌ (40), కడపకు చెందిన అలీ(38), నంద్యాలకు చెందిన జవహరుద్దీన్‌(35), బెంగళూరుకు చెందిన జయకుమారి(30), ఆనందరెడ్డి(54), రాంప్రసాద్‌(57), రా యచోటికి చెందిన నిర్మల(38) తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కర్ణాటక రాయల్పాడు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె, బెంగళూరు, కోలారు, శ్రీనివాసపురం ఆస్పత్రులకు 108 వాహనాల్లో తరలించారు. ప్రమాదఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

19న విజయవాడలో మహా ధర్నా

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఎల్‌. నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని హొచిమన్‌ భవన్‌లో చలో విజయవాడ కరపత్రాలను బుధవారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 86,500 మంది పేద, మధ్య తరగతి అట్టడుగు వర్గాల మధాహ్న భోజన కార్మికులకు నామమాత్రంగా రూ.3 వేలు ఇస్తున్నారన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో తమ కుటుంబ పోషణ కష్టమవుతోందని, నెలకు రూ. 10 వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని వారు కోరారు. ప్రతి విద్యార్థికి రూ.30 మెస్‌ చార్జీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసీ.బాదుల్లా, ఎస్‌.చాంద్‌బాషా, బి.కామాక్షమ్మ, ఎం.మేరి, కోశాధికారి ఎం.పార్వతి పాల్గొన్నారు.

వైద్య మిత్రలను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా గుర్తించాలి

కడప రూరల్‌ : ఈ నెల 16వ తేదీలోపు తమను ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా గుర్తిస్తూ జీఓ జారీ చేయకపోతే 17వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టులో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది స్పష్టం చేశారు. తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుకోసం ఆందోళన బాట పడుతూ విధుల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో ఆ ట్రస్టు సీఈఓ డాక్టర్‌ పి.రవిసుభాష్‌తో ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు జరిగిన చర్చలు విఫలమవడంతో సంఘం కడప జిల్లా నాయకులు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 17, 24వ తేదీల్లో జిల్లా కో ఆర్డినేటర్‌ కార్యాలయం ఎదుట, 27న మంగళగిరి ట్రస్ట్‌ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే వైద్య మిత్రలు విధులకు హజరవుతారని ఆ ట్రస్ట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వి.బాలాంజనేయులు తెలిపారు.

ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

నలుగురి పరిస్థితి విషమం

40మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ1
1/5

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ2
2/5

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ3
3/5

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ4
4/5

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ5
5/5

కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement