చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Sep 17 2025 7:11 AM | Updated on Sep 17 2025 7:11 AM

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

మోటకొండూర్‌: విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. మోటకొండూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అండర్‌–14, 17 జిల్లా స్థాయి ఖోఖో పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఎంతో చురుకుగా ఉండడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఆటల్లో గొప్పగా రాణించి భవిష్యత్‌లో మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈడీ రఘురాంరెడ్డి, గడసంతల సీత, మధుసూదన్‌, నాతి మల్లేష్‌, కృష్ణమూర్తి, విశ్రాంత పీఈటీ పూల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement