
వైభవంగా నిత్యకల్యాణోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రంలో బుధవారం అర్చకులు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని వేకువజామునే తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంపై గల ఉత్తరం దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ చేపట్టి నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ద్వార బంధనం చేశారు.