
బీఆర్ఎస్ హయాంలోనే గోదావరి జలాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గానికి అధిక నిధులు, గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి సమృద్ధిగా పంటలు పండాయని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు యుగేంధర్రావు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రజాక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లు లేక చెరువులు ఎండి పోతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ల సహకారంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వ్యక్తిగతంగా దూషణలు చేయడం, స్థాయికి తగ్గట్లుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్రెడ్డి, తాటికొండ సీతయ్య, కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కల్లెట్లపల్లి శోభన్బాబు, కందుకూరి బాబు పాల్గొన్నారు.