
రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ సహకారంతో నల్లగొండ కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాలను తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు ప్రారంభించారు. మొదటిరోజు కరీంనగర్ చైతన్య కళాభారతి వారు స్వప్నం రాల్చిన అమృతం అనే నాటిక, హైదరాబాద్ శ్రీ కళానికేతన్ వారు ఈ మంచం నాది కాదు అనే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వెంకట్రెడ్డి, సెక్రటరీ జెల్లా శ్రీశైలం, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్. కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం

రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం