ప్రజావాణిలో 70 వినతులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో 70 వినతులు

Jul 15 2025 12:07 PM | Updated on Jul 15 2025 12:07 PM

ప్రజావాణిలో 70 వినతులు

ప్రజావాణిలో 70 వినతులు

భువనగిరిటౌన్‌ : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో వినతులు భారీగా వచ్చాయి. మొత్తం 70 అర్జీలు రాగా.. అత్యధికంగా 57 అర్జీలు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు వినతిపత్రాలు స్వీకరించారు.

● భువనగిరిలో ఇందిరమ్మ క్యాంటీన్‌ ఏర్పాటు చే యాలని కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు మహ్మద్‌ షరీఫ్‌, లయిఖ్‌అహ్మద్‌ కోరారు.

● కొరటికల్‌లోని నల్లచెరువు అలుగు, కాలువ ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామానికి చెందిన నరహరిగౌడ్‌ విన్నవించారు.

● భువనగిరిలోని 11వ వార్డు పరిధిలో సర్వే నం. 118లో 68 మందికి ప్లాట్లు కేటాయించి పొజిషన్‌ చూపలేదని లబ్ధిదారులు అర్జీ అందజేశారు.

ఫ అత్యధికంగా భూ సమస్యలపైనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement