బడులిలా.. చదివేదెలా! | - | Sakshi
Sakshi News home page

బడులిలా.. చదివేదెలా!

Jun 11 2025 7:42 AM | Updated on Jun 11 2025 7:42 AM

బడులి

బడులిలా.. చదివేదెలా!

25 శాతం పనులే పూర్తి

మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మన బస్తి–మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.52 లక్షలతో చేపట్టిన నిర్మాణాలు పిల్లర్స్‌ దశలోనే ఆగి పోయాయి. 600లకు పైగా బాలబాలికలున్న ఈ సూ్‌క్‌ల్‌లో మేజర్‌, మైనర్‌ వర్క్స్‌, 25 శాతం పనులు రంగులు, విద్యుద్ధీకరణ, స్లాబ్‌ మరమ్మతులు పూర్తిచేశారు. టాయిలెట్స్‌ పనులు పిల్లర్ల దశలో వదిలి వేశారు. అదే విధంగా డైనింగ్‌ హాల్‌ (భోజనశాల) బేస్మెంట్‌ నింపి పిల్లర్ల దశలోనే ఆపేయడంతో విద్యార్థులకు శాపంగా మారనుంది.

ఆలేరు : మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఉన్నత బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలల్లో మనఊరు–మనబడి కింద విద్యు త్‌, ఫ్యాన్‌లు, కిటికీల మరమ్మతులు పూర్తయ్యాయి. తరగతి గదుల ఫ్లోరింగ్‌ పనులు జరిగాయి. కొన్ని తరగతి గదుల్లో కొన్ని ఫ్యాన్‌లు పనిచేయటం లేదు. అలాగే కరెంట్‌ ఆన్‌ఆఫ్‌ స్వీచ్‌లు, ఫ్యాన్‌ల రెగ్యులేటర్లు సరిగా లేవు. పాఠశాలల ఆవరణలు పిచ్చిమొక్కల నిండి ఉన్నాయి. ఎంఆర్‌సీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. ఈ భవనాన్ని కూల్చివేసి, కొత్త భవనం నిర్మించేందుకు కలెక్టర్‌కు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ భవనం వద్ద పరిసరాలు అధ్వానంగా మారాయి. బాలికల ఉన్నత పాఠశాల వెనుక ఉన్న మరో స్కూల్‌ భవనం కూడా శిథిలమైంది. ఈభవనాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించాలని కలెక్టర్‌కు ప్రతిపాదన చేశారు.

అసంపూర్తిగా బడి పనులు

రాజాపేట : మండలంలోని 14 పాఠశాలలకు మన ఊరు మనబడి పథకం ద్వారా 64 పనుల నిమిత్తం రూ. 2.84కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. పాఠశాలల్లో మౌలిక వసతలు కల్పించాల్సి ఉన్నా ఇప్పటి వరకు కేవలం విద్యుత్‌ పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులు అసంపూర్తిగానే వదిలేశారు. రాజాపేట, పాముకుంట, రఘునాథపురం, చల్లూరులో బోజన ఏర్పాటు కోసం చేపట్టిన క్యాంటీన్‌ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఆగింది.

ఆగిన అదనపు గది నిర్మాణం

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కలెక్టర్‌ క్రూసీయల్‌ బ్యాలన్స్‌ ఫండ్‌ కింద రూ.8లక్షలతో మంజూరై అదనపు గది నిర్మాణం పనులు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లర్లకే పరిమితమైంది. ఈ పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థుల వరకు ఉంటారు. గదులు సరిపోక గతేడాది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు, ఉపాధ్యాకులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద మౌలిక వసతులు

కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో

పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పూర్తికాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తరగతి గదులు నిర్మాణం వంటి పనులు చేపట్టినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం శ్రీసాక్షిశ్రీ ఆయా పాఠశాలలను విజిట్‌ చేసింది. దీంతో ఎంపికై న పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్న వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ విద్యాసంవత్సరంలో చేరనున్న విద్యార్థులకు సమస్యలను స్వాగతం

పలకనున్నాయి.

ఫ ప్రభుత్వ స్కూళ్లలో నిలిచిన

‘మన ఊరు–మనబడి’ పనులు

ఫ నిధుల లేమితో ఎక్కడచూసినా అసంపూర్తిగానే నిర్మాణాలు

ఫ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి..

ఫ రేపటి నుంచి పాఠశాలల

పునఃప్రారంభం

పెచ్చులూడుతూ.. శిథిలావస్థలో..

బొమ్మలరామారం : మండలంలోని కంచల్‌తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయి. గత విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు గాను 64 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివారు. ఈ భవనం బేస్‌మెంట్‌ శిథిలావస్థకు చేరుకొని పందికొక్కులకు ఎలుకలు స్థావరంగా మారింది.

బడులిలా.. చదివేదెలా! 1
1/5

బడులిలా.. చదివేదెలా!

బడులిలా.. చదివేదెలా! 2
2/5

బడులిలా.. చదివేదెలా!

బడులిలా.. చదివేదెలా! 3
3/5

బడులిలా.. చదివేదెలా!

బడులిలా.. చదివేదెలా! 4
4/5

బడులిలా.. చదివేదెలా!

బడులిలా.. చదివేదెలా! 5
5/5

బడులిలా.. చదివేదెలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement