
ఈవీఎంలకు ప్రత్యేక భద్రత కల్పించాలి
భువనగిరిటౌన్ : ఈవీఎంల గోదాము వద్ద ప్రత్యేక భద్రత కల్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన.. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి భువనగిరి కలెక్టరేట్లోని గోదాములో భద్రపర్చిన ఈవీఎంలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ను తెరిపించి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జలకుమారి, డీటీ సురేష్బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది ఉన్నారు.
ఫ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి