రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ

Oct 16 2025 6:20 AM | Updated on Oct 16 2025 6:20 AM

రేషన్

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక 22న ఎస్‌ఆర్‌కేఆర్‌లో జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ ఆదర్శనీయులు బీవీ రాజు కిల్కారి సేవలను వినియోగించుకోవాలి ఉద్యోగ విరమణ వయసు పంచాయితీ మళ్లీ వాయిదా

తాడేపల్లిగూడెం రూరల్‌: దండగర్ర రేషన్‌ డిపోలో రేషన్‌ సరఫరాలో అవకతవకలపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. దండగర్ర రేషన్‌ డిపో నిర్వాహకుడు చిక్కాల అంబేడ్కర్‌ రేషన్‌ సక్రమంగా పంపిణీ చేయడం లేదని, అవకతవకలకు పాల్పడుతున్నాడని కార్డుదారుల నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్‌ ఎం.సునీల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సివిల్‌ సప్లయిస్‌ డీటీ అన్నపూర్ణ విచారణ చేశారు. రేషన్‌ డిపో వద్ద స్టాకు బోర్డు లేకపోవడం, కార్డుదారుల ఫిర్యాదుల మేరకు రేషన్‌డీలర్‌పై కేసు నమోదు చేస్తామని డీటీ అన్నపూర్ణ తెలిపారు. రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

తణుకు అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఆర్‌ఎస్‌ఎఫ్‌ఐ, ఏపీఆర్‌ఎస్‌ఏ రోలర్‌ స్కేటింగ్‌ హాకీక్వాడ్‌, కేడెడ్‌ (అండర్‌ 12), సబ్‌ జూనియర్స్‌ (అండర్‌ 15) ఎంపికలు బుధవారం తణుకు మాంటిస్సోరీ స్కూలు రింక్‌లో నిర్వహించారు. ఈ ఎంపికల్లో 7గురు కేడెడ్‌ బాలురు, సబ్‌ జూనియర్‌ బాలురు 8 మంది ఎంపికై నట్లు అబ్జర్వర్‌ షేక్‌ ఖాసిం తెలిపారు. సానబోయిన స్నేహశ్రీ ఓపెన్‌ కేటగిరీలో ఎంపికై ంది. వీరంతా వచ్చేనెల 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా స్కూలు డైరెక్టర్‌ అనపర్తి ప్రకాశరావు విద్యార్థులకు శిక్షణనిచ్చిన కోచ్‌ అరెకపూడి భార్గవ్‌ను అభినందించారు.

భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈనెల 22వ తేదీన డిస్ట్రిక్ట్‌ యూత్‌ ఫెస్టివల్‌ సందర్భంగా జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ సైన్స్‌ మేళా, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్‌ కేవీ మురళీకృష్ణంరాజు, సెట్వెల్‌ సీఈఓ కేఎస్‌ ప్రభాకరరావు తెలిపారు. బుధవారం కళాశాల మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌ హాల్‌లో సైన్స్‌ మేళా, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఎన్‌ గోపాలకృష్ణమూర్తి, ఎం సురేష్‌బాబు మాట్లాడుతూ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో బహుమతులు పొందిన ప్రాజెక్టులను అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు సాగి విఠల్‌ రంగరాజు, చీఫ్‌ అడ్మిని

స్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ దిలీప్‌ చక్రవర్తి, సెట్వెల్‌ అధికారులు పాల్గొన్నారు.

భీమవరం: భీమవరం పట్టణంలోని విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీ రాజు జయంతి సందర్భంగా బుధవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బీవీ రాజు పాఠశాలలోని ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు రూ.83 వేలు స్కాలర్‌షిప్‌లు అందించారు. భీమవరం, శృంగవృక్షంలోని లెప్రసీ రోగులకు బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని సెంట్‌మేరీస్‌ లెప్రసీ సెంటర్‌లోని ఎయిడ్స్‌, టీబీ, లెప్రసీ రోగులకు రూ.60 వేలు విలువైన మందులతోపాటు 250 మందికి బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. విష్ణు విద్యాసంస్థల విద్యార్థులు ఏఎస్‌ఎన్‌ రాజు చారిటబుల్‌ ట్రస్ట్‌ బ్లడ్‌బ్యాంక్‌లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు.

వీరవాసరం: కిల్కారి సేవల (చిన్నారి చిరునవ్వు)ను గర్భిణులు, బాలింతలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ గీత బాయ్‌ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశ నోడల్‌ ఆఫీసర్స్‌ మీటింగ్‌లో కిల్కారి సేవలపై ఆమె సమీక్ష నిర్వహించారు. కిల్కారి కాల్‌ ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని గర్భిణులు, బాలింతలు పూర్తిగా వినేటట్లు చేయాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కిల్కారి కాల్‌ సర్వీస్‌ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గర్భిణీ అయినా 4 వ నెల మొదలు పుట్టిన బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకు కిల్కారి కాల్స్‌ వస్తాయని, తద్వారా తల్లీ బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందజేస్తుందన్నారు. ఆశ నోడల్‌ ఆఫీసర్లు గర్భిణీలు, బాలింతలకు కిల్కారి సేవలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్‌ అధికారిణి డాక్టర్‌ సుధా లక్ష్మి, డీపీహెచ్‌ఎన్‌ఓ వెంకట్‌రత్నం, డీసీఎం ఎన్‌.వెంకట స్వామి, కిల్కారి రీజనల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బి.రాజు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పరిమితిని యూజీసీ నిబంధనల మాదిరిగానే 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వేసిన రిట్‌లపై విచారణ ఈ నెల 13న జరిగింది. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఈనెలమూడో వారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంతో ఉద్యాన వర్సిటీ వీసీ నియామక వ్యవహారం ముడిపడి ఉండటంతో, వర్సిటీలోని వీసీ కుర్చీ 45 రోజులుగా ఖాళీగానే ఉంది.

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ 1
1/3

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ 2
2/3

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ 3
3/3

రేషన్‌ సరఫరా అవకతవకలపై విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement