తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌ | - | Sakshi
Sakshi News home page

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌

Jun 12 2025 2:56 AM | Updated on Jun 13 2025 7:04 AM

తొలి

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌

పూడికతీత.. ఏదీ నాణ్యత ?
గోదావరి కాల్వ పూడిక తీత పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో తమకు సాగునీటి కష్టాలు తప్పవేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో u
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. 2024 జూన్‌ నుంచే పథకాలను అమల్లోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కూటమి నేతలు తర్వాత ఆ ఊసే మరిచారు. సూపర్‌ సిక్స్‌ హామీలను పట్టాలెక్కించకుండానే సంవత్సర కాలాన్ని గడిపేశారు. సంక్షేమ ఫలాల కోసం ఎదురుచూసిన ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.

గురువారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 5న నరసాపురం, పాలకొల్లు, ఏప్రిల్‌ 10న తణుకు, ఏప్రిల్‌ 21న నరసాపురం, భీమవరం, ఏప్రిల్‌ 29న తాడేపల్లిగూడెం, మేన 10న ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ సిక్స్‌పై హామీలిచ్చారు. తల్లికి వందనం కింద ఏటా చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకు రూ.15,000 చొప్పున ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలొచ్చే వరకు నెలకు రూ.3,000 భృతి అందజేస్తామన్నారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తెచ్చి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. అన్నదాతకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 20,000 చొప్పున ఆర్ధికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

సర్వేలతో సరి:

ఎన్నికల హామీలను గాలికొదిలేసి సర్వేలతో కాలం గడిపేసింది. తొలి ఏడాది తల్లికి వందనం, నిరుద్యోగభృతి, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి తదితర పథకాల జాడలేదు. పింఛన్‌ సాయాన్ని రూ.వెయ్యి పెంచిన ప్రభుత్వం, కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. 11 నెలల తర్వాత స్పౌజ్‌ పింఛన్ల మంజూరును ప్రారంభించింది. నవంబరు నుంచి మృతిచెందిన వారి భార్యలకు మాత్రమే పింఛన్‌ సాయాన్ని వర్తింపజేస్తోంది. గత ఏడాది జూన్‌ నాటికి జిల్లాలో 2,32,885 పింఛన్లు ఉండగా వారికి రూ.99.80 కోట్లు సాయంగా అందించారు. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 2,25,718కు చేరగా ఆ మేరకు ప్రభుత్వ సాయం రూ.96.87 కోట్లకు తగ్గింది.

ఏడాదికి మూడు సిలెండర్లని చెప్పిన ప్రభుత్వం మొదటి ఆర్థిక సంవత్సరం ఒక్క సిలెండర్‌కే పరిమితం చేసింది. జిల్లాలో 6.21 లక్షల గ్యాస్‌ కనెక్షన్లకు నవంబరు నుంచి మార్చి 31వ తేదీ నాటికి 4.42 లక్షల మందికి సింగిల్‌ సిలెండర్‌ లబ్ధి చేకూరింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి బుధవారం నాటికి 4.62 సిలెండర్ల బుకింగ్స్‌ జరగ్గా ఇంతవరకు 1.67 లక్షల మందికి మాత్రమే దీపం పథకం లబ్ధి చేకూరింది.

సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో పాలకుల వైఫల్యాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలు తూర్పారబడుతున్నారు. ఓట్ల కోసం ఎన్నికల ముందు కూటమి నాయకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలకు తమ సృజనాత్మకను జోడిస్తున్నారు. కొన్నింటికి సినీ సన్నివేశాలను జతచేస్తున్నారు. కొన్ని సినిమాల్లోని హాస్య సన్నివేశాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి రామానాయుడు, ఇతర నాయకులు చెప్పిన మాటలను వాయిస్‌ ఓవర్‌ జతచేసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలోని పలు సందర్భాల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ తదితర సామాజిక మాద్యమాల్లో ఎక్కడ చూసిన సూపర్‌సిక్స్‌పై రీల్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

న్యూస్‌రీల్‌

అమలుకు నోచుకోని సూపర్‌సిక్స్‌ హామీలు

పింఛన్‌ పెంపు, సింగిల్‌ సిలెండర్‌తో ఏడాది పూర్తి

ప్రజల నుంచి నిరసన సెగ

హామీల అమలుపై ఉండిలో మంత్రి లోకేష్‌ను ప్రశ్నించిన స్థానికులు

సోషల్‌ మీడియా వేదికగా సర్కారును తప్పుపడుతున్న నెటిజన్లు

గత ప్రభుత్వంలో తొలి ఏడాదే నవరత్నాలు

2019 సీఎంగా బాద్యతలు చేపట్టిన మొదటి నెల నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థల్ని ఏర్పాటుచేసి తల్లికి వందనం, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ ఆసరా, పింఛన్‌ సాయం పెంపు, ఇంటింటికే పింఛన్ల పంపిణీ తదితర పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. కులమత వర్గాలకు అతీతంగా, రాజకీయాలు చేయకుండా అర్హులైన వారందరికి సంక్షేమ లబ్ధిని నేరుగా వారి గడప చెంతకు చేర్చారు. పథకాల అమలులో దళారులు, మధ్యవర్తుల బెడద లేకుండా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేశారు మాజీ సీఎం జగన్‌

నిరసనల సెగ

2024 జూన్‌ నుంచే అమల్లోకి వచ్చే సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరేది వివరిస్తూ కూటమి నేతలు కరపత్రాలు పంచిన విషయం విదితమే. సంక్షేమ పథకాల అమలులేకపోగా ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడం, విద్యుత్‌ చార్జీలు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం తదితర రూపాల్లో ప్రజలపై భారం పెరిగింది. మార్కెట్‌లో మనీ రొటేషన్‌ ఆగిపోవడంతో వ్యాపారాలు తగ్గిపోయాయి. సూపర్‌సిక్స్‌ పథకాలు అమల్లోకి రాకపోవడంపై మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితర వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ఉండి పర్యటనకు రాగా ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా రూ. 1500, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలుచేస్తారు సారూ?.. అంటూ స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు.

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌ 1
1/3

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌ 2
2/3

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌ 3
3/3

తొలి ఏడాది సూపర్‌ ఫ్లాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement