సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం

Jun 12 2025 2:56 AM | Updated on Jun 13 2025 7:05 AM

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం

సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం

పెనుమంట్ర: ఈనెల 12 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం పెడతారని జాయింట్‌ కలెక్టర్‌ టి రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం మండలంలోని పాలమూరు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని, మార్టేరు శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి సన్న బియ్యం స్టాకును పరిశీలించారు. జిల్లాలోని 1423 ప్రభుత్వ పాఠశాలలు, 75 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం సరఫరా చేశారన్నారు. జిల్లాకు ఎక్కువ శాతం బాపట్ల జిల్లా బియ్యం వచ్చిందన్నారు. ఆయన వెంట సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ పి.శివరాం ప్రసాద్‌, సాంఘిక సంక్షేమ అధికారి రామాంజనేయ రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement