
జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
27 నుంచి రథోత్సవాల నిర్వహణ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథస్వామి వారి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6 వరకు జగన్నాథుని రథోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను పూరీ క్షేత్రంలో నిర్వహించే విధంగా చిన వెంకన్న దేవస్థానం ఇక్కడ వైభవంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న రథంపై స్వామి వారు లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి ఊరేగింపుగా వెళ్తారు. అలాగే ఉత్సవాల ముగింపు రోజు జులై 6న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురానికి రథయాత్రగా వెళ్లనున్నారు. రథోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో జగన్నాథస్వామి వారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు.
దశావతారాలు ఇలా..
27న మత్స్యావతారం, 28న కూర్మావతారం, 29న వరాహావతారం, 30న నరసింహావతారం, జులై 1న వామనావతారం, 2న పరశురామావతారం, 3న రామావతారం, 4న కృష్ణావతారం, 5న కల్కిఅవతారం, 6న శ్రీవేంకటేశ్వర స్వామి అవతారం

జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

జగన్నాథుని రథోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు