వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌గా వెంకటరాయుడు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌గా వెంకటరాయుడు

Jun 12 2025 2:56 AM | Updated on Jun 13 2025 7:05 AM

వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌గా వెంకటరాయుడు

వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్‌గా వెంకటరాయుడు

సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ సీనియర్‌ నేత చినమిల్లి వెంకటరాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. భీమవరం రూరల్‌ రాయలంకు చెందిన వెంకటరాయుడు గతంలో గ్రామ సర్పంచ్‌గా, రూరల్‌ జెడ్పీటీసీగా, పార్టీ సేవాదళ్‌ విభాగం రీజనల్‌ కోఆర్డినేటర్‌గా, కాపు నాడు జిల్లా అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వర్తించారు.

స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలి

భీమవరం: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్న విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బుధవారం భీమవరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో రవాణ శాఖ నిబంధనలను ఉల్లంఘించి విద్యాసంస్థల్లో బస్సులు, వ్యాన్లు నడుపుతున్నారన్నారు. ఫిటెనెస్‌ లేని వాహనాల్లో ఎక్కువ మందిని తరలిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.

డీఎస్సీ పరీక్షలకు 19 మంది గైర్హాజరు

భీమవరం: జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 19 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం పరీక్షకు 95 మందికి 91 మంది హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 165 మందికి 150 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

కై కలూరు: అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమమ్యాయి. ఏలూరు జిల్లాలోనే అత్యధిక వర్షపాతం కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో 193.6గా బుధవారం నమోదైంది. మండవల్లి మండలంలో 96.4, కై కలూరు మండలంలో 75.2, కలిదిండి మండలంలో 38.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కై కలూరులో పలు డ్రెయిన్లలో నీరు పొంగి రహదారులపైకి చేరాయి. వెలంపేటలో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కై కలూరు టౌన్‌హాల్‌లో చేరిన నీటితో ఆ ప్రాంతం బురదగా మారింది.

జూలై 31 వరకూ స్కూల్‌ ఫీజు చెల్లింపునకు అవకాశం

భీమవరం: సార్వత్రిక విద్యాపీఠం ద్వారా టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాల కోసం ఫీజు చెల్లించడానికి జూలై 31 వరకు సమయం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుం రూ.200 చెల్లించి ఆగస్టు 15 వరకు గడువు ఉంటుందని చెప్పారు.

విద్యుత్‌ అధికారుల బదిలీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు, పశ్చిమ గోదావరి సర్కిళ్ల పరిధిలో పలువురు అధికారులను బదిలీ చేశారు. జిల్లా స్టోర్స్‌లో ఏఈఈ అవుట్‌ డోర్‌గా పని చేస్తున్న మురళీకృష్ణను జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్‌ ఏఈఈగా బదిలీ చేశారు. పెదవేగి డిప్యూటీ ఈఈ ఆపరేషన్స్‌గా పని చేస్తున్న బీవీ కృష్ణ రాజాను రాజోలు ఆపరేషన్స్‌ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ ఈఈగా పని చేస్తున్న ఐవీ మల్లేశ్వరరావును పెదవేగి, రంపచోడవరం రూరల్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ ఈఈ దివాకరరావును తణుకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement