
సురక్షిత తాగునీరు అందించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): సురక్షిత తాగునీరు అందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవా లని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధ వారం క్యాంపు కార్యాలయం నుంచి తాగునీరు, పన్ను వసూళ్లు, శానిటేషన్, అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు, తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల చేసిన నేపథ్యంలో మంచినీటి చెరువులలో నీరు నింపుకొని సురక్షత తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలన్నారు. ట్యాంకులు, పైప్ లైన్ లీకేజీల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అనుమతులు లేకుండా అనధికార లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండి చదువుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ర్యాలీలో కార్మిక, సాంఘిక సంక్షేమ. విద్య, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలల సంరక్షణ కేంద్రాలు తనిఖీ చేయాలి
బాలల సంరక్షణ కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. కమిటీ చైర్పర్సన్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు గల్ఫ్ దేశాలకు వెళ్లడం వలన వారి పిల్లల సంరక్షణ బాధ్యతల విషయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి బాలల సంరక్షణ కోసం ఒక లేఖను ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.