భీమవరం: వేసవి సెలవుల అనంతరం నూతన విద్యాసంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో సుమారు 1,430 పాఠశాలలు ఉండగా వాటిలో దాదాపు 96 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ స్కూళ్లను సైతం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సౌకర్యాలు కల్పించారు. దీనితో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన యూనిఫాం, పుస్తకాలు, షూస్, సాక్స్, బెల్ట్, టై, బ్యాగ్లతో సంతోషంగా స్కూల్కు వెళ్లి ఆనందంగా తిరిగొచ్చేవారు. స్కూళ్లలో పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యబోధన సాగింది. అప్పట్లో మనబడి నాడు–నేడు పథకం ద్వారా జిల్లాల్లోని దాదాపు 750 స్కూళ్లను అభివృద్ధికి చేయడానికి సుమారు రూ.257 కోట్లు మంజూరు చేయడంతో దాదాపు పాఠశాలలన్నీ సుందరంగా తయారయ్యాయి.
నిలిచిపోయిన నాడు–నేడు పనులు
గతంలో ప్రైవేటు స్కూళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ స్కూళ్లను అంతగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి పూర్వపు పరిస్థితి పునరావృతమవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన స్కూళ్ల అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చినా గత ఏడాది కాలంగా వాటిని పట్టించుకోలేదు. జిల్లాలో దాదాపు 30 స్కూళ్లలో పనులు నిలిచిపోయాయి. నాడు–నేడు పథకాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేయడంతో మిలిగిన పనులు నిచిలిపోయాయి. దాంతో అప్పట్లో స్కూళ్ల భవన నిర్మాణాల కోసం పాఠశాలల ఆవరణలో సిద్ధం చేసిన ఇనుము, కంకర, ఇసుక నిరుపయోగంగా మిలిగిపోగా ఇనుము తుప్పుపట్టింది. కంకర, ఇసుక మట్టిలో కలిసిపోతోంది. దీంతో కోట్లాది రూపాయాల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన ప్రభుత్వం కొత్తగా స్కూళ్ల భవనాలను నిర్మించకపోగా కనీసం గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను సైతం ఏడాది కాలంగా పూర్తిచేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు–నేడుకు గ్రహణం
ఏడాది కాలంగా పూర్తికాని స్కూల్ భవనాలు
విద్యార్థులకు తప్పని అవస్థలు
విద్యార్థులకు సమస్యల స్వాగతం
విద్యార్థులకు సమస్యల స్వాగతం