
పడకేసిన ప్రగతి
జూదాలకు బానిసై..
జూదాలకు బానిసైన ఓ వ్యక్తి యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపడేలా చేసింది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను గాలికొదిలేసింది. రూ.75 కోట్ల విలువైన పనులను రద్దుచేసి.. త్వరలో తమ వెతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న స్థానికుల ఆశలపై నీళ్లు చల్లింది.
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: పల్లెల ప్రగతికి గత ప్రభుత్వం పెద్దపీట వేసింది. గతంలో మండల, జిల్లా కేంద్రాలకే పరిమితమైన పాలన వ్యవస్థల్ని పల్లెలకు చేర్చడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేశారు. అందుకోసం సచివాలయ వ్యవస్థను తెచ్చి ఒక్కో సచివాలయంలో 11 శాఖల ఉద్యోగులను నియమించారు. 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షల చొప్పున జిల్లాలో 353 భవన నిర్మాణాలకు సుమారు రూ.141.2 కోట్లు మంజూరు చేశారు. కూటమి వచ్చేనాటికి వీటిలో 270 భవనాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అన్నదాతల కోసం ఆర్బీకేల ద్వారా సాగులో సరికొత్త అధ్యాయానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విత్తు నుంచి పంట ఉత్పత్తులు విక్రయం వరకు ఇవి అన్నదాతలకు అడుగడుడునా అండయ్యాయి. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్ఫుట్ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో రూ. 65 కోట్లు వ్యయంతో 298 భవన నిర్మాణాలు చేపట్టగా గతంలోనే వీటిలో 211 భవనాలు వినియోగంలోకి వచ్చి రైతులకు సేవలందిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వసతులతో హెల్త్ క్లీనిక్లు నిర్మించింది. ఒక్కో 214 హెల్త్ క్లినిక్లకు రూ.53.5 కోట్లు మంజూరు చేసింది. 96 భవనాలు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చింది.
పడకేసిన పనులు : గత ప్రభుత్వంలో ఆయా భవన నిర్మాణాలు శరవేగంగా సాగాయి. సుమారు 83 సచివాలయ భవనాలు, 87 ఆర్బీకేలు, 118 హెల్త్ క్లినిక్ల నిర్మాణం మిగిలి ఉంది. వీటిలో 18 సచివాలయ, 16 ఆర్బీకే, 14 హెల్త్ క్లినిక్లు పనులు దాదాపు పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తిచేసే దిశగా కూటమి ప్రభుత్వం చొరవ చూపక చాలా వరకు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారి కోసం నిర్మిస్తున్న కమ్యునిటీ హాల్ పనులు నిధుల లేమితో చాలా చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి.
న్యూస్రీల్
కూటమి నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి
జిల్లాకు 353 సచివాలయాలు, 298 ఆర్బీకేలు, 214 హెల్త్ క్లినిక్లు మంజూరు
గతంలోనే 70 శాతం భవనాలు పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చిన ప్రభుత్వం
కూటమి వచ్చాక నిర్మాణాలకు బ్రేక్
రూ.75 కోట్లు విలువైన రోడ్లు, వంతెనల నిర్మాణాల పనులు రద్దు
అభివృద్ధి పనులకు బ్రేక్
భీమవరం రూరల్ గొల్లవానితిప్ప, దొంగపిండి, పట్టణంలో రెస్ట్హౌస్ రోడ్డు వద్ద వంతెనలకు అప్రోచ్ రోడ్డులు లేక రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో అప్రోచ్ల నిర్మాణానికి రూ. 36.71 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాళీపట్నం– భీమవరం వంతెన వద్ద రూ. 9.22 కోట్లు, భీమవరం–దొంగపిండి వంతెన వద్ద రూ. 16.58 కోట్లు, దెయ్యాలతిప్ప–నాగిడిపాలెం వంతెన వద్ద రూ. 10.91 కోట్లుతో టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈలోగా ఎన్నికలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాధనలను అటకెక్కించింది. ఉండి నియోజకవర్గంలోని చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 25 కోట్లు, భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బోండాడ డ్రైయిన్పై వంతెనకు రూ.12 కోట్లు, ఆచంట నియోజకవర్గం నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాల మరమ్మతులకు రూ. 1.57 కోట్ల పనులను రద్దుచేసింది.

పడకేసిన ప్రగతి

పడకేసిన ప్రగతి