
మహిళల రక్షణలో కూటమి విఫలం
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు, చిన్నారులు, బాలికలు, యువతులపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెచ్చుమీరిపోతున్నాయని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పాతబస్టాండ్ సెంటరులోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ అనంతపురంలో దళిత బాలికపై దుండగులు అమానుషంగా హత్యాచారానికి పాల్పడినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, చింతలపూడి మహిళా అధ్యక్షురాలు చండీప్రియ, కై కలూరు మహిళా అధ్యక్షురాలు దున్నా బేబి, దెందులూరు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు అంగడాల సీతారావమ్మ, జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు సాయిల స్వాతి, తొత్తడి వేదకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మందా జయలక్ష్మి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమలలో..
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరిగిన అకృత్యాలు, అన్యాయాలకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో, రాజమండ్రి సిటీ గోకవరం బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంగారమ్మ, పార్టీ ద్వారకాతిరుమల మండల మహిళా అధ్యక్షురాలు మల్లెపూడి నాగమణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. గోపాలపురం, దేవరపల్లి మండలాల మహిళా అధ్యక్షురాలు కప్పల వరలక్ష్మి, కడలి హైమావతి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకు రక్షణేది
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సిపి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్రా జయసరిత అన్నారు. మంగళవారం పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. జయ సరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలేనని.. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, సమన్వయకర్త గూడూరి ఉమాబాల, నరసాపురం మున్సిపల్ చైర్మన్ బర్రి వెంకటరమణ, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, మద్దా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో..
భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయని వైఎస్సార్సీపీ నాయకురాలు గంటా అనితారాణి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భీమవరం 13వ వార్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు

మహిళల రక్షణలో కూటమి విఫలం

మహిళల రక్షణలో కూటమి విఫలం

మహిళల రక్షణలో కూటమి విఫలం

మహిళల రక్షణలో కూటమి విఫలం