
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు
భీమవరం: స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం జిల్లాలో పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారని, తల్లిదండ్రులు ప్రైవేట్ వ్యామోయం వీడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాలకు చెందిన 119 హైస్కూ ల్ విద్యార్థులకు, 34 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల విలువైన చెక్కు, మెడల్, ప్రశంసా పత్రం అందజేస్తున్నామన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డీఈఓ ఈ.నారాయణ, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి ఎ.నాగేశ్వరరావు, ఏపీసీ పి.శ్యామ్సుందర్, డీఈఓ ఏడీ సత్యనారాయణ, డిప్యూటీ ఏఓ ఎన్.రమేష్, సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు.