నవధాన్యాల సాగుతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

నవధాన్యాల సాగుతో భూసారం పెంపు

Jun 6 2025 7:35 AM | Updated on Jun 6 2025 7:35 AM

నవధాన్యాల సాగుతో భూసారం పెంపు

నవధాన్యాల సాగుతో భూసారం పెంపు

భీమవరం: వరి సాగు అనంతరం భూమిలో నవధాన్యాల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుందని జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వై.నూకరాజు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్‌ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. నవధాన్యాల సాగు వల్ల భూమిలో సూక్ష్మజీవుల జీవనం పునరుత్థానమవుతుందని, తద్వారా భూమి సారవంతమై ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నా రు. జిల్లా వ్యవసాయశాఖాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజామృతం, ఘన, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్నాస్త్రం, కోడిగుడ్డు నిమ్మ రసం ద్రావణం, బయో కల్చర్‌ తయారీ విధానాల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించారు. వైద్య శాస్త్ర విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement