ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం

May 4 2025 8:06 AM | Updated on May 4 2025 8:06 AM

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి, మాజీ మంత్రి కారుమూరి

కాళ్ల: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్నా అభివృద్ధి జాడలేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలోనూ విఫలమైందని, ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదు నూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నా గేశ్వరరావు అన్నారు. మండలంలోని పెద అమిరంలో శనివారం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పార్టీ నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అబ ద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించి కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో మ ట్టి, గ్రావెల్‌ మాఫియాలతో రౌడీ పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, అధైర్యపడవద్దని భరో సా ఇచ్చారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, పార్టీకి 2019 నాటి పునర్వైభవం తప్పక వస్తుందని స్పష్టం చేశారు.

సంస్థాగతంగా పునర్నిర్మాణం

పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మాణం చేస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నా రు. ఇప్పటికే జిల్లాస్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేశామని, రానున్న రోజుల్లో గ్రామ, బూత్‌ స్థాయిలో కమిటీలు వేస్తామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంపద సృష్టి బాబు కుటుంబానికే.. రాష్ట్రంలో సంపద సృష్టి చంద్రబాబు కుటుంబానికే అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ప్రతి రైతుకూ న్యాయం చే స్తామని ప్రగల్భాలు పలికిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఇక్కకి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గోనె సంచు లు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

అప్పుడు నీరు–మట్టి.. ఇప్పుడు చాక్లెట్‌

అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోదీ ఏదో ఇస్తారని ప్రజలంతా ఎదురు చూశారని, గతంలో నీరు–మట్టి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌క ల్యాణ్‌ కోసం చాక్లెట్‌ తెచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపన పేరుతో కూటమి ప్రభు త్వం అప్పులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని మండిపడ్డా రు. అనంతరం జిల్లా పరిశీలకుడు మురళీ కృష్ణంరాజును నేతలు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల ఇన్‌చార్జులు పీవీఎల్‌ నరసింహరాజు, గుడాల గోపి, నేతలు పేరిచర్ల విజయ నరసింహరాజు, బంధన పూర్ణచంద్రరావు, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement