గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

Apr 30 2025 12:41 AM | Updated on Apr 30 2025 12:48 AM

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

కుక్కునూరు: గోదావరిలోకి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని వింజరం రేవులో జరిగింది. కుక్కునూరు ఎస్సై రామక్రిష్ణ చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామానికి చెందిన ఉప్పల సాయిరాం (27) ఆటోమొబైల్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు వినకుండా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మంగళవారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి పొలిపాకలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వింజరం రేవుకు చేరుకున్న సాయిరాం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఇంట్లో గొడవ పడి వచ్చిన విషయం తెలుసుకున్న బంధువులు గోదావరి నది ఒడ్డున సాయిరాం బైక్‌ ఉండడాన్ని చూసి గోదావరిలో వెతకగా మృతదేహం లభించినట్టు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై రామక్రిష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement