25 స్కూటీల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

25 స్కూటీల స్వాధీనం

Nov 6 2024 12:54 AM | Updated on Nov 6 2024 12:54 AM

25 స్కూటీల స్వాధీనం

25 స్కూటీల స్వాధీనం

ఏలూరు టూటౌన్‌, కై కలూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలో 25 స్కూటీలు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వీటి విలువ రూ. 17.50 లక్షలు ఉంటుందని అంచనా. 8లో u

నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా రమణరావు బాధ్యతల స్వీకరణ

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌వీ రమణరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ ఎన్‌ఐటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు ఏపీ నిట్‌ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకుముందు హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎస్‌ మూర్తి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. రమణరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మేలు చేసే విభిన్న పరిశోధనలు, ప్రా జెక్ట్‌లపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూ చించారు. నాణ్యమైన విద్యా బోధనను విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి మౌలిక వసతులను ఏర్పాటు చే సేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీ నిట్‌ పురోభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు, అందజేయాలని కోరారు. నిట్‌ప్రాంగణాన్ని పరిశీలించి, బోధన, బోధనేతర సిబ్బందితో పలు విషయాలపై సూచనలు చేశారు. నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి, డీన్‌ రిసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ జీఆర్‌కే శాస్త్రి, డీన్‌లు టి.కురుమయ్య, ఎన్‌.జయరామ్‌, కార్తీక్‌ శేషాద్రి, అసోసియేట్‌ డీన్‌ వి.సందీప్‌, పలువురు విభాగాపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement