
రోజుకు 30సార్లు కరెంట్ పోతోంది..
దుగ్గొండి: గ్రామాల్లో రోజుకు 30సార్లు కరెంట్ పోతోందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ వేణుగోపాలాచారికి ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో విద్యు త్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, పలువురు విద్యుత్ సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ కోతలతో రైతులు, వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ బావుల కనెక్షన్ కోసం డీడీలు తీసినా లైన్ ఇవ్వడం లేదని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందరికీ వర్తింప జేయాలని, మీటర్లు బిగించుకున్న ఎస్సీ, ఎస్టీలను గృహజ్యోతి పరిధిలోకి తేవాలని కోరారు. అనంతరం చైర్మన్ వేణుగోపాలచారి మాట్లాడుతూ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 200 యూనిట్ల విద్యుత్ పథకం అందరికి అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యులు చరణ్దాస్, రమేశ్, రమణారావు, డీఈ తిరుపతి, ఏడీ లక్ష్మణ్, ఏఈలు రామ్మూర్తి, ప్రత్యూష పాల్గొన్నారు.
సీజీఆర్ఎఫ్ చైర్మన్
వేణుగోపాలాచారికి ప్రజల ఫిర్యాదు
దుగ్గొండిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక