
ఈజీఎస్ పనుల పరిశీలన
గీసుకొండ: మండలంలోని గీసుకొండ, ఎలుకుర్తి, మనుగొండ, అనంతారం, మచ్చాపూర్, వంచనగిరి, శాయంపేట గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన భూగర్భ జల సంరక్షణ పనులను ‘జల సంచాయ్ – జల భగీరథ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నేషనల్ వాటర్ మెషీన్ జిల్లా నోడల్ అధికారి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, ఇతర పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ చంద్రకాంత్, ఈసీ శ్రీలత, రాజు, క్లస్టర్ సురేష్, టీఏలు సుష్మ, సత్యనారాయణ సింగ్, ఎన్ఆర్డీపీఆర్ఏ నిమ్మల శేఖర్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్ట్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: దివ్యాంగులకు సహాయ ఉపకరణాల సదుపాయాల మంజూరికి అర్హులైనవారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు tgobmms.cgg.gov.inలో తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈనెల 18వ వరకు గడువు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు మహిళలు, పిల్లలు, దివ్యాంగు, వయోవృద్దుల సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు శిక్షణ
జిల్లాలో నూతనంగా న్యాయవాద పట్టాపొందిన ఎస్పీ పట్టభద్రులకు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వద్ద వృత్తి శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో www. telanganaepass.cgg.gov.in వెట్సైట్ ద్వారా జూలై 31 లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
నిర్దేశిత లక్ష్యాలను
చేరుకోవాలి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు
గీసుకొండ: మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలవరీలు, వ్యాధి నిరోధక టీకాలు అందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు.. వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
హెల్త్ డైరెక్టర్
రవీందర్కు పరామర్శ
సంగెం: రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ బానోత్ రవీందర్ నాయక్ తండ్రి శంకర్లాల్ నాయక్ అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సెన్ నాయక్ సోమవారం బీకోజీనాయక్ తండాకు వేర్వేరుగా వెళ్లి శంకర్లాల్ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సపావట్ మహేందర్నాయక్, నాయకులు సపావట్ కిషన్, వీరన్న, వెంకన్న, మదన్లాల్, జిత్తు, సంగెం ఎస్సై నరేష్, సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నాయకులు రమేష్, నర్సింహనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ కోర్సుల అసిస్టెంట్
డైరెక్టర్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముంజం శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వెంకటగోపినాథ్ గడువు ముగియడంతో శ్రీనివాస్ను నియమించారు.

ఈజీఎస్ పనుల పరిశీలన

ఈజీఎస్ పనుల పరిశీలన