ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి

Jun 11 2025 7:41 AM | Updated on Jun 11 2025 7:41 AM

ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి

ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి

ఖానాపురం: రైతులు ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌ యాత్రలో భాగంగా ఖానాపురం రైతువేదికలో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలస్యగా వరి సాగు చేస్తే అనేక ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా నాట్లు వేసుకుంటే రబీలోనూ ముందస్తుగా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. జులై మొదటి వారంలో రైతులు నాట్లు వేసుకోవడానికి సమాయత్తం కావాలని సూచించారు. ఇందుకోసం నీటి విడుదలకు ఇరిగేషన్‌ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ సత్యశారద, యూనివర్సిటీ వీసీ జానయ్య మాట్లాడుతూ పంటల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. అనంతరం రైతులకు విత్తన బస్తాలను అందజేశారు. కరపత్రాలను ఆవిష్కరించారు. డీఏఓ అనురాధ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, ఏడీఆర్‌ ఉమారెడ్డి, శాస్త్రవేత్తలు శ్రీధర్‌, రాజు, వెంకన్న, ఇరిగేషన్‌ ఈఈ సుదర్శన్‌రావు, ఏడీఏ దామోదర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శాఖమూరి హరిబాబు, ఏఓ శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్‌రెడ్డి, రైతులు సుబ్బారావు, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement