
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన
వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ స్కూల్ నిర్మా ణం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని స్థానిక నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును కోరడంతో మున్సిపాలిటీ పరిధిలోనే స్కూల్ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ విజయ్సాగర్, ఆర్ఐ అసిఫ్, మండల సర్వేయర్ గీత, అసిస్టెంట్ సర్వేయర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ సంపత్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ (గువ్వల బోడు) దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అన్మిరెడ్డి కృష్ణారెడ్డి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తూల్ల రవి, నాయకులు సిలివేరు శ్రీధర్, పులి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.