వనపర్తి: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వ్యర్థమని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకోవాలని 97 రోజులుగా అఖిలపక్ష పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న మాజీమంత్రి హరీశ్రావు వస్తున్నారని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పర్యటనతో బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం అన్నారు.
మాజీమంత్రి నిరంజన్రెడ్డి


