శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం
మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనులపండువగా జరిపారు. మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. రథాన్ని బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన ఈ వేడుకను ఉమ్మడి పాలమూరుతో పాటు హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో మక్తల్ రాంలీలా మైదానం మార్మోగింది. – మక్తల్
శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం


