ఎన్ని నిధులైనా ఇస్తా..
సీఎం పర్యటన హైలెట్స్..
వడ్డించేది నేనే..
పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలు మొదటగా మక్తల్లో నిర్వహించాలని మంత్రి వర్గ సహచరులు నిర్ణయించారని సీఎం పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అడగడంతో మక్తల్ నుంచే ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ‘కౌన్ పూచేగా మక్తల్ అని పాత నానుడిని కాదని.. సబ్ కుచ్ పూచేగా, సబ్ కుచ్ ఆయేగా మక్తల్’ అని ఇక్కడ విజయోత్సవం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిందని.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తనకు అండగా నిలబడ్డారని, పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణకు రెండో సీఎం అయ్యానన్నారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి సీఎంగా బూర్గుల రామకృష్ణారావు కాగా.. 75 ఏళ్ల తర్వాత తెలంగా ణకు రెండో ముఖ్యమంత్రిగా మీ బిడ్డ సీఎం అయి మీ ముందు నిలబడ్డానన్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట: ‘పాలమూరు జిల్లాకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ ఘన స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ.1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు.
‘రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా ఇంటింటికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. మహిళలకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేశాం. వచ్చిన పైసలు కరెంట్ బిల్లుకు సరిపోయేదని, దానిని దృష్టిలో పెట్టుకొని ఉచిత కరెంట్ అందిస్తున్నాం. నారాయణపేట మహిళలకు పెట్రోల్ బంక్ మంజూరు చేశాం. మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు 25.35 లక్షల రైతులకు రూ.21,653 కోట్ల రుణమాఫీ చేశాం. ఏడాదికి రూ.12 వేల రైతు భరోసాను వేశాం. 1.04 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికి నిరంతరం పని చేస్తున్నాం.’ ముఖ్యమంత్రి అన్నారు.
‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ
వచ్చాక కూడా జిల్లాను ఎవరూ
పట్టించుకోలేదు
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆత్మకూర్/అమరచింత: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1గంటకు ఆత్మకూర్కు రావాల్సి ఉండగా.. 2:40 గంటలకు చేరుకున్నారు.
జాతర మైదానంలోని హెలిప్యాడ్ నుంచి సీఎం రేవంత్రెడ్డి నేరుగా ప్రత్యేక కాన్వాయ్లో పీజేపీ క్యాంపు కాలనీకి బయలుదేరారు.
గాంధీ చౌరస్తాకు మధ్యాహ్నం 2:45 గంటలకు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వాహనంపై నిల్చొని కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలు, స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపారు.
గాంధీ చౌరస్తాలో 5 నిమిషాల పాటు సీఎం కాన్వాయ్ నిలిచింది.
సీఎంను మరింత దగ్గరగా చూడాలని కార్యకర్తలు బారీకేడ్లను తోసుకుంటూ రావడంతో పోలీసులు నిలువరించే యత్నం చేశారు.
అనంతరం పీజేపీ క్యాంపు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
35 నిమిషాల్లో కార్యక్రమాలను ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్కు బయలుదేరి వెళ్లారు.
సీఎం పర్యటన సందర్భంగా ఆత్మకూర్ ప్రధాన చౌరస్తాలో మధ్యాహ్నం 3:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మీ ఆశీర్వాదంతోనే
సీఎం అయ్యాను..
ఎన్ని నిధులైనా ఇస్తా..
ఎన్ని నిధులైనా ఇస్తా..


